మన్యం కాఫీకి అంతర్జాతీయంగా పేరున్న విషయం తెలిసిందే. కానీ రైతులకు సరైన ధర దక్కడం లేదని ఆందోళనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాఫీ కొనుగోలు ధరలను పెంచుతూ రైతులకు తీపి కబురు అందించింది మన్యం ఐటీడీఏ సంస్థ. ఈ మేరకు కాఫీ రకాన్ని బట్టి కిలోకి రూ. 10 నుంచి రూ. 50 మధ్యలో పెంచారు. అంతేకాకుండా ఇంటి వద్దే కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేశారు. ఇక కాఫీ సేకరించిన డబ్బులను రైతుల ఖాతాల్లో 24 గంటల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు.