కార్తీక మాసం ప్రారంభం కావటంతో శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. కార్తీక సోమవారాల్లో పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో శివ భక్తులకు ముఖ్యమైన గమనిక. బాపట్ల జిల్లాలోని సముద్ర తీరాలను అధికారులు మూసివేశారు. మొంథా తుఫాను ప్రభావంతో సముద్ర తీరాల్లో గోతులు ఏర్పడ్డాయి. ఈ గోతుల కారణంగా సుడిగుండాలు ఏర్పడి సముద్ర స్నానాలు చేసే భక్తుల ప్రాణాలకు ప్రమాదం తలెత్తవచ్చనే కారణంతో నవంబర్ 4వ తేదీ వరకూ బాపట్ల జిల్లాలో బీచ్లు మూసివేశారు.