ఏపీని లాజిస్టిక్ హబ్గా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే కొత్త ఎయిర్ పోర్టులు నిర్మించాలని సంకల్పించింది. ప్రస్తుతం ఉన్న ఏడు విమానాశ్రయాలకు అదనంగా మరో ఏడు విమానాశ్రయాలు నిర్మించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. రాజధాని అమరావతితోనూ అనుసంధానం పెంచేలా.. అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మించాలని ప్రతిపాదించారు. 5000 ఎకరాల్లో అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.