ఏపీలో కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సహకారంతో కొత్త విమానాశ్రయాల ఏర్పాటులో వేగం పెరిగింది. ఇక ఉత్తరాంధ్ర వాసులకు ఎంతో ముఖ్యమైన భోగాపురం విమానాశ్రయం పనులు సైతం వేగంగా జరుగుతున్నాయి. 2026 జూన్ నాటికి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తు్న్నారు. మరోవైపు భోగాపురం ఎయిర్ పోర్టు పనుల కోసం ఏపీ ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. భోగాపురం విమానాశ్రయం కోసం రూ.195 కోట్లు ప్రతిపాదించారు.