Bhogapuram International Airport Ready 2026 June: ఆంధ్రప్రదేశ్లో కొత్త విమానాశ్రయాల దిశగా అడుగులు పడుతున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు వేగవంతం అయ్యాయి. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను పరిశీలించి, ఉత్తరాంధ్రకు ఇది కీలక కేంద్రంగా మారుతుందని తెలిపారు. 2026 జూన్ నాటికి విమానాశ్రయాన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టుతో ఈ ప్రాంత అభివృద్ధి పరుగులు పెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.