ఏపీలో క్రీడాభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో స్టేడియం నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాలో రెండు స్టేడియాలు నిర్మించనున్నారు. జగన్నాథగట్టు వద్ద సీఎస్ఆర్ నిధులతో ఆరు ఎకరాల్లో క్రికెట్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించనున్నారు. అలాగే మునగాలపాడు బాల సాయిబాబా స్కూల్ వద్ద ఏసీఏ సహకారంతో మరో స్టేడియం నిర్మించేందుకు కసరత్తు జరుగుతోంది.