New Cricket Stadiums in Andhra Pradesh: అమరావతిలో కొత్త క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ వడివడిగా అడుగులు వేస్తోంది. 60 వేల సీటింగ్ సామర్థ్యంతో స్టేడియం నిర్మించనున్నారు. అమరావతి స్టేడియాన్ని మల్లీ ఈవెంట్ స్టేడియంగా తీర్చిదిద్దనున్నట్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సానా సతీష్ వెల్లడించారు. రాష్ట్రంలో తొలి విడతలో మూడు చోట్ల క్రికెట్ స్టేడియాలు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.