రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలు ఏవీ తమ వద్ద లేవని స్పష్టత ఇచ్చింది. జిల్లాల పునర్వవస్థీకరణపై శాసనమండలిలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు.. ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. నూతన జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలు ఏవీ ప్రభుత్వం వద్ద లేవని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ హయాంలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేశారని మంత్రి ఆరోపించారు. కొన్ని జిల్లా కలెక్టరేట్లలో కుర్చీలు కూడా లేని పరిస్థితి ఉందన్నారు.