Perecherla To Kondamodu National Highway: ఆంధ్రప్రదేశ్లో పేరేచర్ల-కొండమోడు హైవేను నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం రూ.881.61 కోట్లు కేటాయించింది. ఈ రహదారి గుంటూరు, హైదరాబాద్ మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. తాజాగా, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేస్తూ మూడు కిలోమీటర్ల మేర రోడ్డును విస్తరించాలని ప్రతిపాదించారు. దీనివల్ల హైదరాబాద్, పల్నాడు నుంచి అమరావతికి వెళ్లేవారికి ప్రయాణం సులభతరం అవుతుంది. ప్రస్తుతం డిజైన్లో మార్పులు చేసి ఫిరంగిపురం బైపాస్ను వేములూరిపాడు దగ్గర కలపాలని యోచిస్తున్నారు.