Ntr Bharosa Pension Scheme New Applications: ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ నుంచి కొత్తవారికి పింఛన్లు ఇవ్వాలని కసరత్తు చేస్తున్నారు. ముందుగా వితంతువులకు కొత్తగా పింఛన్లు మంజూరు చేయనున్నారు. మొత్తం 1.53 లక్షల మంది అర్హులని అంచనా వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్ల అవుతున్న సందర్భంగా కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నారు. వితంతువుల తర్వాత దివ్యాంగులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.