ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జాతీయ రహదారులు, రోడ్ల విస్తరణ పనులు వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏపీలో ఏళ్ల తరబడిగా ముందుకు కదలని ప్రాజెక్టులకు కూడా మోక్షం కలుగుతోంది. ఈ క్రమంలోనే విజయవాడ పశ్చిమ బైపాస్ రహదారి నిర్మాణం పూర్తి కావొచ్చింది. దీంతో హైదరాబాద్ నుంచి గన్నవరం, ఏలూరు, రాజమహేంద్రవరం, విశాఖకు వెళ్లేవారికి ఉపయోగకరంగా ఉండనుంది. అయితే విజయవాడ వెస్ట్ బైపాస్ కారణంగా ప్రయాణ సమయం ఆదా కావటంతో పాటుగా.. ఈ ప్రాంతంలోని భూముల ధరలకు రెక్కలు వస్తున్నాయి.