Amaravati Errupalem Railway Line Rs 20247 Crores: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రైలు మార్గం ఏర్పాటుకు కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు మధ్య 57 కి.మీ మేర కొత్త రైలు లైన్ నిర్మాణానికి రూ.2,047 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టుకు 2025-26 బడ్జెట్లో రూ.171 కోట్లు కేటాయించగా, భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.