Errupalem Amaravati Railway Line Land Acquisition: కేంద్రం సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో రైల్వే లైన్ పనులను వేగవంతం చేస్తోంది. ఎర్రుపాలెం-నంబూరు రైల్వే లైన్కు భూసేకరణ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే 12 గ్రామాల్లో మార్కింగ్ పూర్తయింది. మొదటి దశలో ఎర్రుపాలెం నుండి అమరావతి వరకు 27 కిలోమీటర్ల మేర పనులు చేపట్టనున్నారు. మొత్తం 56.53 కి.మీ మేర రైల్వే లైన్ నిర్మాణం కానుంది. దీనికి కేంద్రం రూ.2,047 కోట్లు ఖర్చు చేస్తోంది.