Kotipalli To Narsapur New Railway Line: కోనసీమ వాసుల చిరకాల స్వప్నం నిజమయ్యే వేళ! కోటిపల్లి-నర్సాపురం రైలు మార్గం నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. భూసేకరణ సమస్యలు, కోర్టు వివాదాలు పరిష్కారం కావడంతో పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి. రైతుల సమస్యలను పరిష్కరించి, గోదావరిపై బ్రిడ్జి నిర్మాణానికి మార్గం సుగమం అయింది. త్వరలో పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు. ఈ రైలు మార్గం పూర్తయితే ఆ ప్రాంత ప్రజల ప్రయాణ కష్టాలు తీరనున్నాయి.