Guntur To Kanigiri New Train Proposed: పశ్చిమ ప్రకాశం, మార్కాపురం జిల్లావాసులు.. ముఖ్యంగా కనిగిరి ప్రాంత ప్రజల కలనెరవేరనుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రైలు సౌకర్యం త్వరలోనే అందుబాటులోకి రానుంది. గుంటూరు నుంచి కనిగిరి వరకు ప్యాసింజర్ రైలును నడిపేందుకు రైల్వే అధికారులకు ప్రతిపాదనలు పంపారు. వారంలో ఆరు రోజుల పాటూ రైలును నడిపేలా ప్రతిపాదించారు. రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారని.. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని చెబుతున్నారు.