A Step Forward For Markapuram District Formation: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణపై దృష్టి సారించింది. అద్దంకి నియోజకవర్గాన్ని బాపట్ల జిల్లా నుంచి వేరు చేసి, తిరిగి ప్రకాశం జిల్లాలో కలపడానికి కసరత్తు మొదలైంది. మార్కాపురం జిల్లా ఏర్పాటు, కందుకూరును ప్రకాశంలో కలపడం వంటి అంశాలపై కూడా ప్రభుత్వ యంత్రాంగం చురుగ్గా పనిచేస్తోంది. ప్రజల విజ్ఞప్తులకు అనుగుణంగా ఈ మార్పులు దిశగా అడుగులుపడుతున్నాయి. త్వరలోనే దీనిపై పూర్తిస్థాయిలో క్లారిటీ రానుంది.