Andhra Pradesh New Airports Update: ఆంధ్రప్రదేశ్లో విమానాశ్రయాల అభివృద్ధిపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రం నుంచి వారానికి 1,194 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయని, భోగాపురం విమానాశ్రయం నిర్మాణం జరుగుతోందని కేంద్ర మంత్రి మురళీధర్ మొహోల్ తెలిపారు. కుప్పంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం స్థలం కోసం దరఖాస్తు చేసిందని, దగదర్తి ఒప్పందాన్ని రద్దు చేశామని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా, ఉడాన్ పథకం కింద సీప్లేన్ల నిర్వహణకు అనుమతులు జారీ చేశామని తెలిపారు.