Tirupati Apsrtc New Bus Terminal With Rs 500 Crores: తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక ఇంట్రా మోడల్ బస్సు టర్మినల్ నిర్మాణం, రూ.1.90 కోట్లతో ఆర్టీసీ ఆస్పత్రి ప్రారంభం, రూ.2 కోట్లతో విశ్రాంతి గదుల నిర్మాణం వంటి అభివృద్ధి పనులను రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అంతేకాదు బస్సు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.