Andhra Pradesh Govt Plans Create New It Hub: విశాఖపట్నంలో ఐటీ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భీమిలి నియోజకవర్గంలోని తర్లువాడలో 1,080 ఎకరాల భూమిని పరిశీలిస్తున్నారు. గత ప్రభుత్వం ప్రైవేటు పనులకు ప్రయత్నించగా, కూటమి ప్రభుత్వం వేల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ఐటీ హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తర్లువాడ ప్రాంతంలో ఐటీ కంపెనీలను అభివృద్ధి చేస్తామని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.