Andhra Pradesh Trupti Canteens: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు 'తృప్తి' క్యాంటీన్లను ప్రారంభించింది. మెప్మా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 700 క్యాంటీన్లను 3 వేల మంది మహిళలతో ఏర్పాటు చేయనున్నారు. నెల్లూరులో తొలి క్యాంటీన్ను మంత్రి నారాయణ ప్రారంభించారు. తక్కువ ధరలకే ప్రజలకు భోజనం అందించడంతో పాటు మహిళలకు ఉపాధి కల్పించడమే ఈ క్యాంటీన్ల ముఖ్య ఉద్దేశం. ఎలక్ట్రిక్ పరికరాలు, సోలార్ పవర్ వినియోగంతో పర్యావరణ అనుకూల వంటకాలను అందిస్తారు.