Kurnool Guntur National Highway 340C Update: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైవే పనుల్లో వేగం పెంచింది. కర్నూలు-గుంటూరు (కేజీ) రహదారి పనులు జరుగుతున్నా, నన్నూరు టోల్ ప్లాజా దగ్గర వంతెనలు, సర్వీస్ రోడ్ల పనులు ఇంకా పూర్తి కాలేదు. అక్టోబర్ 2025 నాటికి పనులు పూర్తి కావాల్సి ఉండగా, అప్పుడే టోల్ వసూళ్లు మొదలుపెట్టడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ హైవే పనులు పూర్తి కాకుండానే టోల్ వసూళ్లు చేయడం గమనార్హం.