ఆంధ్రప్రదేశ్లో మరో 6 కొత్త విమానాశ్రయాలు నిర్మించనున్నట్లు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ప్రకటించారు. ఇక భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణాన్ని గడువు కంటే ముందే పూర్తి చేసి.. ప్రారంభించనున్నట్లు తెలిపారు. మరోవైపు.. రాష్టవ్యాప్తంగా రోడ్ల నిర్మాణానికి సంబంధించి కూడా ప్రకటన చేశారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 15 వేల కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయని.. దీనివల్ల ప్రభుత్వంపై అదనంగా రూ.20 వేల కోట్ల భారం పడిందని తెలిపారు.