ఏపీలో కొత్తగా మరో జాతీయ రహదారి విస్తరణ పనుల దిశగా కీలక అప్ డేట్ వచ్చింది. అనకాపల్లి నుంచి దివాన్ చెరువు వరకు నాలుగు వరుసల రహదారిని ఆరు వరుసలకు విస్తరించేందుకు డీపీఆర్ సిద్ధమైంది. ఈ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ డీపీఆర్ సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నారు. రూ.3800 కోట్లతో 160 కిలోమీటర్ల మేరకు ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. మరోవైపు విస్తరణలో భాగంగా పాత వంతెనల రిపేర్లు, కొత్త వంతెనలు, కల్వర్టులు, ఇతర నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది.