ఏపీలో మరో జాతీయ రహదారి విస్తరణకు కసరత్తు జరుగుతోంది. విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే కన్సల్టెన్సీ సంస్థ డీపీఆర్ తయారు చేసింది. ఈ ప్రతిపాదిత డీపీఆర్ మీద గత బుధవారం స్టేక్ హోల్డర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. రహదారి విస్తరణ కష్టమయ్యే ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. అలాగే డీపీఆర్లో అండర్పాస్లు, ఫ్లైఓవర్ల ప్రస్తావన లేకపోవటంతో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.