ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మౌలిక వసతుల ప్రాజెక్టులు, ముఖ్యంగా జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్వోబీ) నిర్మాణాలు వేగవంతమయ్యాయి. ఈ క్రమంలోనే విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా వాసుల ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు పెదమానాపురం రైల్వే గేటు వద్ద ట్రాఫిక్ సమస్యలను తొలగించేందుకు ఆర్వోబీ నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్టు 21 కోట్ల రూపాయలతో విజయనగరం-రాయగడ రైల్వే లైనుపై నిర్మితమవుతోంది. జూన్ నెలాఖరుకు పనులు పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.