Nellore Dagadarthi Airport: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా ఏడు విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని చూస్తోంది. నెల్లూరు జిల్లాలోని దగదర్తి విమానాశ్రయానికి భూసేకరణ సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం నడుం బిగించింది. కౌరుగుంటలో భూమి కోల్పోయిన రైతులకు న్యాయమైన నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఐదు బృందాలను ఏర్పాటు చేసి, నిజమైన లబ్ధిదారులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. త్వరలోనే భూములకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారమై విమానాశ్రయ నిర్మాణం ఊపందుకుంటుందని ఆశిస్తున్నారు.