Andhra Pradesh Another Four New Districts Formation: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు చివరి దశకు చేరింది. మంత్రివర్గ ఉపసంఘం సీఎం చంద్రబాబుతో సమావేశమై తుది నివేదికను రూపొందించనుంది. నవంబర్ 7న కేబినెట్లో ఆమోదం పొందిన తర్వాత, ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి గెజిట్ విడుదల చేస్తారు. ఏజెన్సీ ప్రాంతంలో కొత్త జిల్లా, పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల నియోజకవర్గాలతో అమరావతి కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటుపై ఆలోచనలు జరుగుతున్నాయి.