Gorantla Hindupur National Highway 716G Four Lines: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతిలో పలు జాతీయ రహదారి మరియు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. హిందూపురం-గోరంట్ల మధ్య రూ.809 కోట్లతో 34 కి.మీ జాతీయ రహదారి విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. కడప జిల్లాలోని ముద్దనూరు నుండి హిందూపురం వరకు 150 కిలోమీటర్ల మేర నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం జరుగుతోంది. బెంగళూరు - అమరావతి మధ్య ఆరు వరుసల రహదారి నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోతాయి.