Kadapa Bangalore New Railway Line: ఏపీలో కొత్త రైల్వే లైన్కు సంబంధించి కేంద్రానికి రిక్వెస్ట్ వెళ్లింది. కడప నుంచి బెంగళూరుకు కొత్త రైలు మార్గంపై రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ రైల్వే లైన్ రాయలసీమ అభివృద్ధికి కీలకమైనదని పురందేశ్వరి వివరించారు. ఈ రైల్వే లైన్పై సమీక్ష చేసి పనుల్ని వేగవంతం చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టుపై పలు కీలక అంశాలను ప్రస్తావించారు.