Kadapa Bangalore Railway Line: పులివెందులకు కొత్త రైల్వే లైన్ రానుంది. కడప-బెంగళూరు మార్గంలో ముద్దనూరు-పులివెందుల-ముదిగుబ్బ-శ్రీసత్యసాయి మధ్య 110 కిలోమీటర్ల లైన్ నిర్మాణానికి బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుతో రాయలసీమ పర్యాటకంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. ఉద్యాన పంటలు, ఖనిజాల రవాణా సులభతరం అవుతుంది. బెంగళూరుకు ప్రయాణం కూడా వేగవంతం అవుతుందని భావిస్తున్నారు. ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే కడప, అనంతపురం జిల్లాలకు కూడా ఉపయోగంగా ఉంటుంది.