Nallapadu Bandarupalli ROB Rs 106 Crores: గుంటూరు ప్రజలకు శుభవార్త! నగరంలో రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డులో రెండు చోట్ల వంతెనలు రానున్నాయి. రైల్వే శాఖ నిధులతో టెండర్ల ప్రక్రియ మొదలైంది. శంకర్ విలాస్ ఆర్వోబీకి కూడా శంకుస్థాపన చేస్తున్నారు. ఈ వంతెనలు పూర్తయితే ట్రాఫిక్ కష్టాలు తీరతాయి, ప్రయాణం సులువు అవుతుంది. ఈ మేరకు రూ. 106.65 కోట్లు నిధుల్ని ఖర్చు చేస్తున్నారు.