Errupalem To Amaravati Railway Line: ఏపీ ప్రభుత్వం అమరావతికి సంబంధించిన పనుల్ని వేగవంతం చేసింది. వరుసగా పనులకు సంబంధించి టెండర్లను ఆహ్వానిస్తోంది. ఇటీవల వరల్డ్ బ్యాంక్, ఏడీబీలు కూడా అమరావతికి రుణాలు మంజూరు చేశఆయి. అయితే తాజాగా అమరావతిని కనెక్ట్ చేసే రైలు మార్గంపై మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. అమరావతికి ఏర్పాటవుతున్న రైలు మార్గం ఖర్చు మొత్తాన్ని కేంద్రం భరిస్తుందన్నారు. భూ సేకరణ బాధ్యత మాత్రం రాష్ట్రానిదే అన్నారు.