Nadikudi Srikalahasti New Railway Line Nellore District: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రోడ్లు, రైలు మార్గాలపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో కీలమైన శ్రీకాళహస్తి నడికుడి రైల్వే లైన్కు సంబంధించిన పనుల్ని వేగవంతం చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో పనులు కొనసాగుతుండగానే.. ఇప్పుడు పొరుగునే ఉన్న నెల్లూరు జిల్లాలో కూడా పనులపై ఫోకస్ పెట్టారు. త్వరలోనే పనులు ప్రారంభించేందుకు కాంట్రాక్టర్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.. అలాగే భూ సేకరణపై కూడా కదలిక వచ్చింది.