Andhra Pradesh Mega Health City: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనకాపల్లి జిల్లాలో తరచూ జరుగుతున్న పారిశ్రామిక ప్రమాదాల నేపథ్యంలో బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు హెల్త్ సిటీని ఏర్పాటు చేయనుంది. విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) ఆధ్వర్యంలో పరవాడ, అచ్యుతాపురం మధ్య 7.68 ఎకరాల్లో దీనిని నిర్మించనున్నారు. త్వరలోనే టెండర్లు పిలిచి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో దీనిని అభివృద్ధి చేయనున్నారు. దీనివల్ల ప్రమాద బాధితులకు సత్వర వైద్యం అందుతుంది.