Prakasam District DRDO Team Visit: ఆంధ్రప్రదేశ్కు మరో భారీ పరిశ్రమ రానుంది. ప్రకాశం జిల్లా దొనకొండ సమీపంలో రక్షణ రంగ పరిశ్రమ ఏర్పాటు కానుందని తెలుస్తోంది. DRDO బృందం ఏపీఐఐసీ భూములను పరిశీలించింది. ఢిల్లీ, బెంగళూరుకు చెందిన DRDO ప్రతినిధులు 100 ఎకరాల భూమిని పరిశీలించారు. క్షిపణి తయారీ యూనిట్ను ఏర్పాటు చేయడానికి కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. దొనకొండలోని బ్రిటిష్ కాలం నాటి విమానాశ్రయాన్ని కూడా DRDO బృందం సందర్శించింది.