Andhra Pradesh Rare Earth Elements Found: ఇటీవల కేంద్రం రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కారిడార్లలో ఏపీకి కూడా స్థానం దక్కింది. ఈ క్రమంలో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో కూడా ఖరీదైన ఖనిజాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు అక్కడ ఖనిజాల కోసం అన్వేషణ జరుగుతోంది. ప్రస్తుతం అక్కడ సర్వేతో పాటుగా పరిశోధనలు చేపట్టారు. అలాగే కడప జిల్లాలో కూడా ఖనిజాలు ఉన్నాయి.