ఏపీలో ఘోర ప్రమాదం.. నెల్లూరులో చిరువ్యాపారులపైకి దూసుకెళ్లిన కంటైనర్..

4 months ago 14
నెల్లూరులో ఓ కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. మరికొందరికి గాయాలయ్యాయి. నెల్లూరులోని ఎన్టీఆర్ నగర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై చేపల లోడుతో వెళ్తున్న కంటైనర్ లారీ.. చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే మినీ వ్యానును, మూడు ద్విచక్ర వాహనాలను బలంగా ఢీకొట్టింది. అనంతరం ఓ చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Read Entire Article