ఆంధ్రప్రదేశ్లో టీచర్ల బదిలీలు పారదర్శకంగా చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా బదిలీల నియంత్రణ ముసాయిదా చట్టం-2025ను ఆన్లైన్లో ఉంచింది. ఈ విషయాన్ని ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. బదిలీల నియంత్రణ ముసాయిదా చట్టం ఆన్లైన్లో అందుబాటులో ఉంచామన్న నారా లోకేష్.. దీనిపై ఉపాధ్యాయులు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా.. ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ముసాయిదా చట్టంపై ఉపాధ్యాయులు మార్చి ఏడులోగా అభిప్రాయాలు తెలియజేయాలని నారా లోకేష్ కోరారు.