పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వం ఆ దిశగా అనేక ప్రణాళికలు రచిస్తోంది. ఓ వైపు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు జరుపుతూనే.. కేంద్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర సంస్థలను కూడా ఏపీకి రప్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే నారా లోకేష్ ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్తో భేటీ అయిన నారా లోకేష్.. విశాఖలో డేటా సిటీ ఏర్పాటు, ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని కోరారు.