Andhra Pradesh Dwcra Women Electric Vehicles Subsidy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ, రాయితీపై ఎలక్ట్రిక్ వాహనాలను అందిస్తోంది. మెప్మా సహకారంతో ర్యాపిడోతో అనుసంధానం చేసి, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నంలో 400 మందికి పైగా లబ్ధి పొందారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న డ్వాక్రా మహిళలకు ఈ-బైక్లు, ఈ-ఆటోలు అందజేస్తున్నారు. ఈ పథకం ద్వారా మహిళలు రోజుకు రూ.1000 నుంచి రూ.1500 వరకు సంపాదిస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారు.