Chandrababu In Slbc Meeting With Bankers: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా మహిళలకు ఊరటనిస్తూ, రుణాలపై అధిక ఛార్జీలు తగ్గించాలని బ్యాంకర్లకు సూచించారు. అంతేకాదు టిడ్కో లబ్ధిదారులకు రుణాలు అందించడంలో సాంకేతిక సమస్యలు తొలగించాలని, అమరావతిని ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. ఎంఎస్ఎంఈలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రుణాలిచ్చి ప్రోత్సహించాలని, ప్రకృతి వ్యవసాయం, పునరుత్పాదక విద్యుత్ రంగాలకు సహకరించాలని బ్యాంకర్లను కోరారు. ఈ సందర్భంగా సీఎం పలు సూచనలు చేశారు.