Talliki Vandanam Scheme: ఏపీలో ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానాలు నిలబెట్టుకునేలా బడ్జెట్లో కేటాయింపులు చేశామన్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. కూటమి ప్రభుత్వం వచ్చాక తొమ్మిది వేల కోట్లు నిధులు కేటాయించి 77 కేంద్ర పథకాలను పునరుద్ధరించామన్నారు. త్వరలోనే ప్రారంభిస్తున్న తల్లికి వందనం పథకం వల్ల 73 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కోసం రాష్ట్రం రూ. 6,300 కోట్లు కేటాయించామన్నారు.