ఏపీలో తీరనున్న తాగునీటి కష్టాలు.. కుళాయి కనెక్షన్ల కోసం రూ. 10 వేల కోట్లు..

4 months ago 14
తాగునీటి కష్టాలు తీర్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జల్ జీవన్ మిషన్ కింద ఆగిపోయిన పనులను పూర్తి చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా జాతీయ ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి బ్యాంకు నుంచి రూ.10 వేల కోట్ల రుణం తీసుకోనుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రస్తుతం బ్యాంకు టెక్నికల్ కమిటీ పరిశీలనలో ఉన్నాయి. చేపట్టనున్న పనుల డీపీఆర్‌కు ఆమోదం లభిస్తే.. నిధులు మంజూరు కానున్నాయి. రెండు, మూడేళ్లలో పనులు పూర్తి చేసి.. ముఖ్యంగా వెనుకబడిన జిల్లాల ప్రజలకు మంచినీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Read Entire Article