AP Government 50 Percent Subsidy to Dairy farmers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడి రైతులకు శుభవార్త వినిపించింది. పాడి రైతుల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త పథకం అమలు చేస్తోంది. పశుగ్రాసం కొరత అధిగమించడం సహా పాల దిగుబడి పెంచేందుకు.. 50 శాతం రాయితీపై పశువుల దాణాను అందిస్తోంది. పాడి రైతులకు 50 శాతం రాయితీపై పశువుల దాణా రైతు సేవా కేంద్రాలు, పశువుల ఆస్పత్రుల ద్వారా అందిస్తున్నారు. అయితే ఇందుకు తెల్ల రేషన్ కార్డు కలిగిన సన్న, చిన్నకారు రైతులే అర్హులు.