ఏపీని గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తయారుచేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే తిరుపతిలో తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటైంది. హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థ ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. వేయి కోట్లతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఏడాదికి 25 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేయనున్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ ప్లాంట్ను వర్చువల్గా ప్రారంభించారు.