Nellore Collectorate Free Meals For Petitioners: ఏపీలో తొలిసారి జిల్లా కలెక్టర్ అద్భుతమైన ఆలోచన చేశారు. ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తమ వినతిపత్రాలను ఉన్నతాధికారులకు అందించేందుకు వచ్చే ప్రజల కోసం రాష్ట్రంలో తొలిసారి ఉచిత భోజన వసతి కల్పించారు. నెల్లూరులోని కలెక్టరేట్కు వచ్చిన అర్జీదారులకు 400 మంది వరకు కలెక్టర్ ఆనంద్ భోజన ఏర్పాట్లు చేయించారు. అన్నం, కూర, పప్పు, పెరుగు, స్వీట్ను వడ్డిస్తున్నారు. అన్న క్యాంటీన్లకు భోజనం సరఫరా చేసే శుభోజనం వారు ఈ భోజనాన్ని అందిస్తున్నారు.