కొవిడ్ మహమ్మారి ఎన్ని కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసిందో.. అందరికీ గుర్తుండే ఉంటుంది. భర్తలను కోల్పోయిన భార్యలు, భార్యలను కోల్పోయిన భర్తలు, తల్లిదండ్రులు దూరమైన పిల్లలు.. ఇలా చాలా కుటుంబాలను నడివీధి పాలు చేసింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మిషన్ వాత్సల్య - పీఎం కేర్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఏపీలో తొలిసారిగా తూర్పుగోదావరి జిల్లా దొమ్మేరు వాసికి ఈ పథకం కింద రూ.10 లక్షలు సాయం అందింది.