AP Sadarem Slot Booking Started Today: ఏపీలో దివ్యాంగులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. వైకల్య నిర్ధారణ చేస్తూ, దివ్యాంగులకు జారీ చేసే సదరం ధ్రువపత్రాలకు సంబంధించి స్లాట్ బుకింగ్ ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సచివాలయాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దివ్యాంగులు స్లాట్ బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ నెల 30 నుంచి ఆస్పత్రుల్లో వైద్య పరీక్షల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇకపై సర్టిఫికెట్లను డిజిటల్ విధానంలో అందిస్తారు.