Anantapur Highest Temperature 37 Recorded: ఏపీలో ఎండల తీవ్రత పెరిగింది. మార్చి నెలలోనే భానుడి భగభగలు మొదలయ్యాయి. దేశంలోనే అత్యధికమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం రోజు ఏకంగా 37 డిగ్రీల టెంపరేచర్ నమోదైందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం అవుతుంది. మార్చి నెల నుంచి మే నెల వరకు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది ఐఎండీ.