ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పనుంది. త్వరలోనే దేవాదాయ శాఖలో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. దేవాదాయ శాఖలో అనేక రకాల ఉద్యోగాల్లో ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. వాటి భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు చెప్పారు. కాణిపాకం ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా మంత్రి పట్టువస్త్రాలు సమర్పించారు.